కృష్ణా: ఆల్ ఏపీ బీసీ–వోబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జనవరి 4వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అమరావతి ఉద్యోగుల మహాసభ నిర్వహించనున్నట్లు బీసీ నేతలు తెలిపారు. ఈ మహాసభకు కృష్ణాజిల్లా బీసీ ఉద్యోగుల సంఘం ఆహ్వానం మేరకు గుడివాడ నియోజకవర్గ బీసీ ఐక్యవేదిక తరపున పూర్తి మద్దతు తెలియజేస్తూ..బీసీ ఉద్యోగ సంఘం నాయకులు బ్రౌచర్ను ఈరోజు ఆవిష్కరించారు.