KRNL: బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఎమ్మిగనూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఖాసిం వలి తీవ్రంగా సోమవారం ఖండించారు. ప్రపంచవ్యాప్తంగా హిందువులకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ తక్షణమే స్పందించి దాడులు ఆగేలా ఒత్తిడి తీసుకురావాలని, మైనారిటీల భద్రతకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని అయన కోరారు.