విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ లక్ష్మీశ ఇవాళ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు మండల స్థాయిలోని రెవెన్యూ కార్యాలయంలో కూడా అర్జీలు అందించవచ్చని వివరించారు. ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కారించడం కోసమే ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.