GNTR: ఫిరంగిపురంలోని ఎరువులు, పురుగుమందుల అమ్మకాల దుకాణాలను గుంటూరు రెగ్యులర్ సహాయ వ్యవసాయ సంచాలకులు ఎం. మోహన్ రావు, మండల వ్యవసాయాధికారి వాసంతి సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణాల్లో ఉన్న యూరియా నిల్వలు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే యూరియాను విక్రయించాలని స్పష్టం చేశారు.