MDK: శివంపేట మండలం సికింద్లాపూర్ స్వయంభు వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ధనుర్మాసం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రెండవ శనివారం 12వ రోజు ధనుర్మాసం పురస్కరించుకుని శ్రీ లక్ష్మీనరసింహస్వామికి పంచామృత అభిషేకాలు, అష్టోత్తర నామాలతో పూజ కార్యక్రమం నిర్వహించారు. ధూప దీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు.