NGKL: అచ్చంపేట పట్టణంలో ఈనెల 23న సంత్ సేవాలాల్ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నట్లు గిరిజన నేతలు తెలిపారు. ఈ వేడుకలకు హాజరు కావాలని కోరుతూ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ను కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ వేడుకలకు ఎంపీ డాక్టర్ మల్లురవి, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, ఆర్డీవో యాదగిరి, డీఎస్పీ పల్లె శ్రీనివాస్ హాజరవుతున్నట్లు వారు తెలిపారు.