వరంగల్ కొంగు బంగారమైన భద్రకాళి దేవాలయంలో శుక్రవారం ఉదయం అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు విశేషమైన అలంకరణ చేశారు. భక్తులు ఉదయం నుంచే ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేస్తున్నారు.