MBNR: పాలమూరు విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ ప్రొ. పీ. రమేష్ బాబు, న్యూ పీజీ బాయ్స్ హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యత, హాస్టల్ సౌకర్యాలపై విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో చీఫ్ వార్డెన్ డా. మన్నెమోని కృష్ణయ్య, ప్రిన్సిపల్ డా.సీహెచ్. రవికాంత్ పాల్గొన్నారు.