KMR: బాన్సువాడ పరిధిలో మంగళవారం జరిగిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 1,852 మంది విద్యార్థులకు గాను 1,813మంది పరీక్షకు హాజరయ్యారని విద్యాశాఖ అధికారులు తెలిపారు. 39 మంది గైర్హాజరు కావడంతో 97.89శాతం హాజరు నమోదైంది. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు కల్పించాన్నారు.