VKB: దోమ మండల కేంద్రంలోని కస్తూర్భాగాంధీ పాఠశాలలో దాతలు ఆర్యన్ రాజ్పుత్, దీపన్ భూపతి, సంఘ సేవకురాలు అనిత, నిఖిత సహకారంతో రూ. 80 వేల విలువ గల క్రీడా సామగ్రిని అందించారు. క్రీడలు మానసిక, శారీరక దారుఢ్యానికి ఎంతో దోహదపడతాయని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో వెంకట్, ప్రధానోపాధ్యాయుడు రాములు, కేజీవీబీ పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.