W.G: భీమవరంలోని మార్కెట్ వాటర్ ట్యాంక్ వాల్వ్ రిపేర్ కారణంగా బుధవారం సాయంత్రం మంచినీరు తక్కువగా సరఫరా చేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ రామచంద్ర రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణ ప్రజలు ఈరోజు సాయంత్రం నీటిని పొదుపుగా వాడుకోవాలని, నీటిని వృథా చేయవద్దని ఆయన కోరారు. మరమ్మతులు పూర్తయ్యే వరకు ప్రజలంతా సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.