NDL: నంద్యాల పట్టణంలోని నాగులకుంట రోడ్డులోని నాగలింగేశ్వర స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి షష్టిని ఇవాళ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అర్చకులు విశ్వనాథ శాస్త్రి ఆధ్వర్యంలో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి పంచామృత అభిషేకాలు, ఎండు ఫలాలతో అభిషేకాలు, అర్చనలు, విశేషమైన పూజలు చేశారు.