సత్యసాయి: ధర్మవరం నియోజకవర్గ సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు పరిశీలనలు వేగవంతమయ్యాయి. నీటిపారుదల శాఖ అధికారులు ఆత్మకూరు మండలం పంపనూరు వద్ద HNSS కెనాల్ నుంచి పీఏబీఆర్కు నీటి తరలింపు మార్గాలను మంగళవారం పరిశీలించారు. ఈ సీజన్లోనే నీరు అందించేలా నివేదికను పది రోజుల్లో సమర్పిస్తామని అధికారులు తెలిపారు.