CTR: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి సంబంధించిన గో సంరక్షణ ట్రస్ట్కు దాతలు విరాళం అందజేసినట్లు ఆలయ అధికారులు మంగళవారం తెలిపారు. గుంటూరుకు చెందిన సిద్ధసాయి కుటుంబ సభ్యులతో కలిసి రూ. 1,00,116 లక్షలను అందజేసినట్లు వెల్లడించారు. వారికి ప్రత్యేక దర్శన ఏర్పాటు చేసి, స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో AEO రవీంద్రబాబు, తదితరులు పాల్గొన్నారు.