కర్నూలులోని డా.అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ అభివృద్ధి కోసం పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ రూ.కోటి విరాళాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ప్రొ.షావలి ఖాన్, రిజిస్ట్రార్ ప్రొ.లోకనాథ్ మంత్రి భరత్కు మంగళవారం కృతజ్ఞతలు తెలిపారు. యూనివర్సిటీ పనులు వేగవంతం చేసి, త్వరలోనే సొంత భవనంలో తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.