VSP: నెల రోజులపాటు హింసకు వ్యతిరేకంగా జరిగే ప్రచార ఉద్యమాన్ని జయప్రదం చేయాలని ఐద్వా విశాఖ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్.ఎన్. మాధవి, వై. సత్యవతి పిలుపునిచ్చారు. మంగళవారం విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరిగిన నిరసనలో వారు మాట్లాడారు. దేశంలో, రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు, క్రైమ్ రేటు విపరీతంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.