E.G: గోకవరం మేజర్ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ శనివారం నిర్వహిస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి శిరీష ఓ ప్రకటనలో తెలిపారు. స్వామిత్వ పథకంపై అవగాహన కల్పిస్తామన్నారు. ఉదయం 11 గంటలకు జరిగే సభలో ఇళ్ల సర్వేపై చర్చిస్తామని ఆమె పేర్కొన్నారు. ఏమైనా మార్పులు, చేర్పులు, అభ్యంతరాలు ఉంటే ప్రజలు తెలపాలని కోరారు.