AP: పదో తరగతిలో ప్రతిభ చాటిన బీసీ గురుకులాల విద్యార్థులకు మంత్రి సవిత గుడ్న్యూస్ చెప్పారు. ఈ ఏడాది నుంచి నీట్, ఐఐటీల ప్రవేశ పరీక్షకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. విశాఖలోని సింహాచలం గురుకులంలో బాలురకు, శ్రీసత్యసాయి జిల్లా టేకులోడు గురుకులంలో బాలికలకు శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.