ELR: ఆగిరిపల్లి మండలం సీతారాంపురంలో బుధవారం మంత్రి కొలుసు పార్థసారథి పర్యటించారు. స్థానిక ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉండటంతో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను హెచ్ఎం మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన మంత్రి, సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారిని ఫోన్లో ఆదేశించారు.