KDP: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విధానాన్ని కోటి సంతకాలతో అడ్డుకుంటామని, ప్రజా వ్యతిరేక పాలనను ఖండిస్తామని వేంపల్లె జడ్పీటీసీ ఎమ్. రవికుమార్ రెడ్డి అన్నారు. బుధవారం వేంపల్లి మండల పరిధిలోని బక్కన్నగారిపల్లి గ్రామంలో ప్రతి గడప వద్దకు వెళ్లి ప్రజల నుంచి సంతకాల సేకరణ చేపట్టారు. అనంతరం ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు.