కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్గా సంగాని సచ్చిదానంద వర్మ రానున్నారు. వర్మ గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థలో ఫైనాన్స్ విభాగం అదనపు కమిషనర్గా సుమారు మూడేళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు కాకినాడ నగర పాలక సంస్థకు ఇన్ఛార్జి కమిషనర్గా కేటీ సుధాకర్ బాధ్యతలు నిర్వహించారు. కమిషనర్గా వర్మ ఈనెల 10వ తేదీ తర్వాత బాధ్యతలు తీసుకోనున్నట్లు తెలిసింది.