VZM: బొబ్బిలి మండలం గొర్లె సీతారాంపురంలో జడ్పీ సీఈవో సత్యనారాయణ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా వాటర్ ట్యాంక్ వద్ద క్లోరినేషన్ పనులను పరిశీలించి క్లోరినేషన్ చేసిన తర్వాత నీరు సరఫరా చేయాలని ఆదేశించారు. అలాగే ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ చేయాలని పారిశుధ్య కార్మికులకు సూచించారు. అనంతరం చెత్త సంపద కేంద్రాన్ని సందర్శించారు.