CTR: రాష్ట్ర స్వచ్ఛంద కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరాం పుంగనూరులో మంగళవారం పర్యటించారు. ముందుగా పుంగనూరు మండలంలోని డంపింగ్ యార్డును సందర్శించారు అనంతరం పుంగనూరు మున్సిపల్ కార్యాలయంలో మీడియా సమావేశములో పాల్గొన్నారు. మీడియా సమావేశంలో పట్టాభిరాం పెద్దిరెడ్డిపై ఫైర్ అయ్యారు. ఐదు సంవత్సరాలు సీఎం తర్వాత నేనే సీఎం అని విర్రవీగావు.. ఏం అభివృద్ది చేశారన్నారు.