KMM: ఎర్రుపాలెం మండలం మీనవోలులో మంగళవారం ఇసుక ట్రాక్టర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు. ప్రతిరోజు తెల్లవారుజామున ఇసుక ర్యాంపు నుంచి అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని స్థానికులు ఆరోపించారు. వెంటనే స్థానికులు మండల తహసీల్ధార్, ఎస్సైకు సమాచారం ఇచ్చారు. అక్రమంగా ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరారు.