ELR: నూజివీడు మండలం మద్దాయి కుంట గ్రామంలోని జడ్పీ హైస్కూల్లో శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. హెచ్ఎం దారపురెడ్డి భాస్కరరావు మాట్లాడుతూ.. ఉక్కు మనిషిగా పేరుపొందిన వల్లభాయ్ పటేల్ స్వదేశీ సంస్థానాలను ఏకం చేస్తూ సువిశాల భారతావని నిర్మాణానికి పూనుకున్నట్లు చెప్పారు.