HNK: దేవాదుల కింద దాదాపు 3 లక్షల ఎకరాలలో పంట సాగు అవుతుందని ఒక్క ఎకరం కూడా నీరు అందక ఎండిపోవడానికి వీలు లేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హనుమకొండ దిశ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని, మాట్లాడారు. రానున్న ఈ నెల రోజులపాటు పంట పొలాలకు సాగునీరు అత్యంత కీలకమైన సమయమని, రైతులకు సాగునీరు అందించాలన్నారు.