KKD: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ మొత్తం 65 ఫిర్యాదులను స్వీకరించారు. వాటిలో భూ తగాదాలు – 22, కుటుంబ కలహాలు – 20, ఇతర విభాగాలకు చెందినవి – 23 ఉన్నాయి. ఈ సందర్భంగా ఎస్పీ బిందు మాధవ్ సంబంధిత అధికారులను ఆదేశిస్తూ ప్రతి ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలన్నారు.