ప్రకాశం: ఒంగోలు నగరంలోని మంచినీటి సంపులోకి జారిపడి ఒకరు మృతి చెందారు. మండలంలోని చెరుకుంపాలెంకు చెందిన సీతారాం శ్రీనివాస్ (30) నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ విభాగంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఆదివారం సంపులో జారిపడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని బయటకి తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.