SRPT: టీసేఫ్ యాప్పై విద్యార్థులు, మహిళలు అవగాహన కలిగి ఉండాలని షీటీమ్ ఎస్సై మల్లేష్ అన్నారు. మఠంపల్లి గురుకుల పాఠశాలలో విద్యార్థులకు షీ టీమ్, సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. వారు మాట్లాడుతూ… విద్యార్థులు సామాజిక మాధ్యమాలు, గంజాయికు దూరంగా ఉండాలని తెలిపారు. మహిళలు వేధింపులకు గురైతే 871288606 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు.