SRD: పుల్కల్ మండలం సింగూర్ జలాశయంలో వరద ఉద్ధృతి పెరుగుతోంది. బుధవారం సాయంత్రం 6 గంటల వరకు 30,410 క్యూసెక్కుల వరద వచ్చి చేరినట్లు AEE స్టాలిన్ తెలిపారు. గత మూడు రోజుల నుంచి వరద ప్రవాహం పెరుగుతుండడం వల్ల 4 గేట్లు ఎత్తి దిగువకు 35,750 క్యూసెక్కులు వరదను వదిలి పెట్టినట్లు చెప్పారు. ప్రాజెక్టు నీటిమట్టం ప్రస్తుతం 17.791 టీఎంసీలు ఉందని పేర్కొన్నారు.