GDWL: వనపర్తిలోని ఎస్వీఎంఆర్ డిగ్రీ కళాశాలలో ఫస్టియర్ చదువుతున్న విద్యార్థిని మౌనిష అదృశ్యమైంది. దసరా సెలవుల కోసం స్నేహితురాలి ఊరైన జోగులాంబ గద్వాల జిల్లా అనంతపురం గ్రామానికి వచ్చిన మౌనిష, ఈనెల 5న హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పి వెళ్లి, తిరిగి రాలేదు. బంధుమిత్రుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.