VSP: విశాఖలో జరిగే భారత్-ఆస్ట్రేలియా మహిళల ప్రపంచ కప్ మ్యాచ్ నేపథ్యంలో దిగ్గజ మహిళా క్రికెటర్లు మిథాలీ రాజ్, రావి కల్పనకు అరుదైన గౌరవం లభించనుంది. అక్టోబర్ 12న విశాఖలోని వీడీసీఏ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. స్టేడియంలోని ఒక స్టాండ్కు మిథాలీ రాజ్ పేరు, ఒక గేటుకు రావి కల్పన పేరు పెట్టనున్నట్లు ఏసీఏ సోమవారం ప్రకటించింది.