KMR: నూతనంగా కామారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారిగా నియమితులైన సిహెచ్. మధుమోహన్ సోమవారం కలెక్టరేట్లో విధుల్లో చేరారు. అనంతరం, ఆయన జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్ తో కలిసి కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డీఆర్వో మధుమోహన్ కలెక్టర్కు పూల బోకెను అందజేశారు.