VSP: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత, ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అంటేనే ఒక మోసం అని, ఆయనకు కబుర్లు చెప్పడం తప్ప అభివృద్ధి చేయడం చేతకాదని ఎద్దేవా చేశారు. విశాఖలోని ఉత్తరాంధ్ర వైసీపీ నేతల సమావేశం ఇవాళ నిర్వహించారు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.