MDK: దసరా పండుగను పురస్కరించుకొని రామయంపేట సీఐ వెంకటరాజా గౌడ్ నిజాంపేట మండల పరిధిలో శ్రీ తిరుమల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రామయంపేట సర్కిల్ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాలలోని ప్రజలందరూ పండుగను శాంతియుత వాతావరణంలో ఆనందంగా జరుపుకోవాలని సూచించారు.