NRML: ఆధ్యాత్మిక మార్గం అన్నింటికంటే ఉత్తమమైనదని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. ఆదివారం ఖానాపూర్ పట్టణంలోని విద్యానగర్లో ఏర్పాటుచేసిన దుర్గామాత అమ్మవారి విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు భక్తి మార్గంలో నడవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ మున్సిపల్ ఛైర్మన్ రాజురా సత్యం, మాజీ వైస్ ఛైర్మన్ కావలి సంతోష్ ఉన్నారు.