మహబూబ్ నగర్ పురపాలక పరిధిలోని సగర కాలనీలో ఆదివారం నిర్వహించిన శరన్నవరాత్రి వేడుకలకు మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులు పట్టణ ప్రజలపై ఉండాలని కాంక్షించారు. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో దసరా పండగలు జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.