ASR: నర్సీపట్నం-కేడీపేట నైట్ హాల్ట్ ఆర్టీసీ బస్సు సర్వీసును కొయ్యూరు మండలం రావణాపల్లి గ్రామం వరకూ పొడిగించారు. ఇటీవల టీడీపీ కొయ్యూరు మండల అధ్యక్షుడు కాకురి చంద్రరావు, పలువురు ప్రజలు ఆర్టీసీ రీజనల్ ఛైర్మన్ సియారి దొన్నుదొరను కలిసి నైట్ హాల్ట్ బస్సును పొడిగించాలని కోరారు. ఆయన ఆదేశాలతో రాత్రి బస్సు రావణాపల్లి గ్రామం వస్తుందని చంద్రరావు మీడియాకు తెలిపారు.