KDP: నగరపాలక సంస్థ మొదటి నూతన మహిళా మేయరుగా ముంతాజ్ బేగం బాధ్యతలు స్వీకరించారు. కమిషనర్ మనోజ్ రెడ్డి దగ్గరుండి ఆమెతో సంతకం చేయించి బాధ్యతలు అప్పగించారు. నగరపాలక సంస్థ ఏర్పడి 20 సంవత్సరాల కాలంలో మొదటిసారి మహిళకు మేయరుగా అవకాశం వచ్చిందని పలువురు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మేయరును సత్కరించారు.