SKLM: పాతపట్నం నియోజకవర్గంలో మామిడి గోవిందరావు ఏర్పాటు చేసిన ఎంజీఆర్ ఉచిత మెగా డీఎస్సీ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందిన 80 మంది విద్యార్థులు అర్హత సాధించారు. వీరిని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే మామిడి గోవిందరావు విజయవాడలో గురువారం అభినందించారు. విజేతలు కూటమి ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.