EG: పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (PPA) కార్యాలయాన్ని హైదరాబాద్ నుండి రాజమహేంద్రవరంకి తరలించాలని కేంద్ర జలశక్తి శాఖ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్ట్ పర్యవేక్షణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. వేగవంతమైన పర్యవేక్షణ క్షేత్రస్థాయికి కార్యాలయం దగ్గరగా ఉండటం వల్ల పనుల పురోగతి పర్యవేక్షించడం సులభమవుతుంది.