అన్నమయ్య: సరస్వతిపల్లి గ్రామంలో వీధి కుక్కల దాడి తీవ్ర విషాదానికి దారితీసింది. హరిజనవాడకు చెందిన పిల్లిండ్ల ఆంజనేయులు గొర్రెల మందపై రాత్రి సమయంలో కుక్కల గుంపు దాడి చేసి సుమారు 40 గొర్రెలను చంపివేసింది. ఈ ఘటనతో రైతుకు రూ.4 నుంచి 5 లక్షల మేర ఆర్థిక నష్టం వాటిల్లింది. గ్రామంలో భయాందోళనలు నెలకొనగా, అధికారులు తక్షణ చర్యలు తీసుకుని నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.