KMM: తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా బోడపట్ల సుదర్శన్, కొండం కరుణాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఖమ్మంలో జరిగిన జిల్లా మహాసభలో వారిని ఎన్నుకుని అభినందించారు. గీత కార్మికులకు ప్రభుత్వం రక్షణ కిట్లు మంజూరు చేయాలని, బెల్ట్ దుకాణాలను ఎత్తివేయాలని, ఈత, తాటి చెట్ల పెంపకానికి ప్రభుత్వం సహకారం అందించాలని తెలిపారు.