SDPT: చేర్యాల పట్టణం అన్ని వార్డులో కోతులు సంచరిస్తూ పిల్లలు, వృద్ధులపై దాడులకు పాల్పడుతున్నాయి. కోతుల సంఖ్య పెరగడంతో ప్రజలు ఇంటి తలుపులు మూసి వేసుకుని ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇళ్లపై గుంపులుగా తిరుగుతూ భయాందోళనకు గురి చేస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.