TPT: శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఈవోగా వెంకటేశులు గురువారం బాధ్యతలు చేపట్టారు. ముందుగా స్వామి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం ఆలయ అధికారుల సమక్షంలో ఆయన పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని అన్నారు. అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.