AP: మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితాను మంత్రి లోకేష్ విడుదల చేశారు. డీఎస్సీ అధికారిక వెబ్సైట్లో దీన్ని అందుబాటులో ఉంచారు. మెగా డీఎస్సీలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 20న ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. జూన్ 6 నుంచి జూలై 2 వరకు రెండు విడతలుగా ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించారు. ఏడు విడతలుగా అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేశారు.