KRNL: నగరపాలక పరిధిలోని పలు వార్డు సచివాలయాలను కమిషనర్ పీ.విశ్వనాథ్ బుధవారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రజలందరికీ చేరవేసేలా ఉద్యోగులు అంకితభావంతో కృషి చేయాలని ఆదేశించారు. సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కరించాలని ఆయన సూచించారు.