కృష్ణా: బెజవాడ దుర్గమ్మ దేవస్థానంలో దసరా ఉత్సవాలకు రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు ఆహ్వానం లభించింది. శుక్రవారం మచిలీపట్నంలోని మంత్రి కార్యాలయంలో ఆయనను కలిసి ఆహ్వాన పత్రిక అందచేశారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనవలసినదిగా దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ ఈవో, వేద పండితులు పాల్గొన్నారు.