WGL: గ్రేటర్ వరంగల్ 19వ డివిజన్ పరిధిలోని కాశిబుగ్గలో త్రాగునీరు మురికిగా వస్తుందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. గత మూడు రోజులుగా నీరు ఇలాగే మురికిగా, రంగు మారి రావడంతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని తెలుపుతున్నారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకొని, చర్యలు చేపట్టి శుభ్రమైన నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.