E.G: కడియంలో వాటర్ ట్యాంక్ మరమ్మతుల కారణంగా మార్చి 4 నుంచి మూడు రోజుల పాటు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు కార్యదర్శి శ్రీనివాసరెడ్డి మంగళవారం తెలిపారు. అయితే ఉదయం వేళ గోదావరి నీరు అందుబాటులో ఉంటుందని, అత్యవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీరు పంపిస్తామని చెప్పారు. కావున ప్రజలు ఈ మార్పును గమనించి తమకు సహకరించాలని కోరారు.